నితీశ్ కటారా హత్య కేసులో హైకోర్టు తీర్పు: మరణశిక్ష కాదు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నిందితులకు కఠిన కారాగార శిక్ష తోపాటు భారీ జరిమానా విధించింది. అయితే నిందితులకు ఉరిశిక్ష వేయాలని దాఖలైన పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
నిందితులకు ఉరిశిక్ష వేయలేమని తీర్పు చెప్పింది. వికాస్, విశాల్ యాదవ్లకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 50 లక్షలు జరిమానా విధించింది. మరో నిందితుడు సుఖ్దేవ్ పహల్వాన్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.
తమ సోదరితో సహజీవనం చేస్తున్నాడనే నెపంతో ఘజియాబాద్ సమీపంలో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్దేవ్ పహిల్వాన్లు కలిసి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీష్ కటారాను హత్య చేశారు. 2002, ఫిబ్రవరిలో స్నేహితుడి వివాహానికి వెళుతున్న సమయంలో కటారాను కిడ్నాప్ చేసిన నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
తమ సోదరితో నితీష్ ప్రేమ వ్యవహారం నచ్చని నిందితులు వికాస్, విశాల్.. మరో వ్యక్తి పహిల్వాన్ తో కలిసి కటారాను దారుణంగా కొట్టిచంపారు.