ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ సుపుత్రులు
పాట్నా: ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు ఎన్నికలలో పోటి చెయ్యడం సర్వసాదారణం. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో అన్నదమ్ములు బరిలోకి దిగుతున్నారు. అయితే ఇద్దరూ వేర్వేరు నియోజక వర్గాల నుంచి పోటి చేస్తున్నారు. ఈ అన్నదమ్ములు అసెంబ్లీ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరిక్షీంచుకుంటున్నారు.
ఎలాగైనా విజయం సాధించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవ్వరంటే రాజకీయాలలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు.
ఒకరు తేజ్ ప్రతాప్ యాదవ్, మరొకరు తేజస్వీ యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్ మహూవా నుంచి, తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజక వర్గం నుంచి పోటి చేస్తున్నారు. బుధవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఈ విషయం వెలుగు చూసింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్టుబట్టి తేజస్వీ యాదవ్ ను రాఘోపూర్ నుంచి పోటి చేయిస్తున్నారని వెలుగు చూసింది. తేజస్వీ యాదవ్ పట్టుదల తనకు తెలుసని, ఆయనను అక్కడి నుంచి పోటి చేయ్యించాలని నితీశ్ కుమార్ తన మిత్రపక్షానికి చెందిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఒప్పించారని తెలిసింది.