వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతను పిలిచినా నేను ప్రచారానికి వెళ్ళను, కాని, సెక్యులర్ శక్తులే గెలవాలి..ఎందుకిలా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ఆహ్వనించినా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గోనబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీహర్ :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి.

<strong> షాక్ :బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ అన్సారీ, అఖిలేష్ టిక్కెట్టు ఇవ్వనందుకే</strong> షాక్ :బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ అన్సారీ, అఖిలేష్ టిక్కెట్టు ఇవ్వనందుకే

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి, బిజెపి, ఆర్ ఎల్ డి లు ఒంటరిగా పోటీచేస్తున్నాయి. అయితే ఆర్ ఎల్ డి తొలుత కాంగ్రెస్, సమాజ్ వాదీ కూటమిలో చేరాలని ప్రయత్నించినా చివరినిమిషంలో సాధ్యం కాలేదు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా నిలిచిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల కూటమి విజయం సాధించాలనే ఆకాంక్షను జెడియూ వ్యక్తం చేసింది.

అఖిలేష్ పిలిచినా ప్రచారం చేయను

అఖిలేష్ పిలిచినా ప్రచారం చేయను

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరినా కాని, తాను ఆ ఎన్నికల్లో ప్రచారం చేయబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలు కావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీ కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తాను మనస్పూర్తిగా కోరుకొంటున్నానని చెప్పారు నితీష్ కుమార్.

బీహర్ తరహలో కూటమి ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి

బీహర్ తరహలో కూటమి ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని నిలువరించేందుకుగాను ఆర్ జెడి కాంగ్రెస్ లతో కలిసి తాము ఏర్పాటు చేసిన మహకూటమి మంచి ఫలితాలు సాధించిందని జెడియూ నాయకులు గుర్తుచేస్తున్నారు. బీహర్ తరహలోనే మహకూటమిని ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల కూటమితో పాటు ఇంకా కొన్ని పార్టీలు కలిస్తే ప్రయోజనం దక్కేదని ఆయన చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ లో సెక్యులర్ శక్తులు గెలవాల్సిందే

ఉత్తర్ ప్రదేశ్ లో సెక్యులర్ శక్తులు గెలవాల్సిందే

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచి తీరాల్సిన పరిస్థితుల తప్పనిసరిగా ఉన్నాయని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో సెక్యులర్ శక్తులు విజయం సాధించాలంటే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీల కూటమి విజయం సాధించాలన్నారు నితీష్ కుమార్.

యూపిలో పోటీకి దూరంగా జెడియూ

యూపిలో పోటీకి దూరంగా జెడియూ

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ శక్తుల ఓట్లు చీలకుండా ఉండేందుకుగాను జెడియూ దూరంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆర్ ఎల్ డి తో కలిసి జెడియూ పోటీచేస్తోందని తొలుత ప్రచారం సాగింది.అయితే సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది జెడియూ

English summary
nitish kumar do not campaign in uttarpradesh elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X