మోడీ క్యాబినెట్లో చేరేందుకు నిరాకరించిన నితిష్ కుమార్
మోడీ క్యాబినెట్లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయు పాలుపంచుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో బీహార్లోని మొత్తం నలబై స్థానాలకు గాను బీజేపీ, జేడీయు,తోపాటు ఏల్జేపీలు కలిసి మొత్తం నలబై స్థానాలకు గాను 39 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే 16 స్థానాలు గెలుచుకున్న జేడీయుకు చెందిన ఒక్కరికే మోడీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ప్రకటించడంతో నితీష్ నిరాకరించినట్టు తెలుస్తోంది.
కాగా బీజేపీ 17 లోక్సభ స్థానాలను, ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అధ్యర్యంలోని జనతాదళ్ యూ 16 స్థానాల్లో పోటి చేసి గెలిచాయి. ఇక వీరితోపాటు రాంవిలాస్ పాశ్వన్ నాయకత్వం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే మోడీ క్యాబినెట్లో రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ అయిన ఎల్జేపీకి ప్రాతినిథ్యం లభించగా ..జనతాదళ్ యూ కు మాత్రం క్యాబినెట్లో కొనసాగేందుకు నిరాకరించింది.
అయితే నితీష్ కుమార్తో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షాల మధ్య చర్చలు కొనసాగాయి. క్యాబినెట్లో బెర్తుకు సంబంధించి నితీష్కు సైతం అవకాశం కల్పించారు కాని దీన్ని నితీష్ మాత్రం నిరాకరించినట్టు తెలుస్తోంది.ఎందుకంటే మొత్తం 16 స్థానాల్లో గెలిచిన జేడీయు క్యాబినెట్లో ఒక్కరికే అవకాశం కల్పిస్తామని బీజేపీ చెప్పడంతో నీతిష్ బీజేపీ ఆఫర్ను నిరాకరించినట్టు తెలుస్తోంది.
మిత్రపక్షాలతో కలిసి క్యాబినెట్ను ఏర్పాటు చేస్తున్న మోడీ ప్రభుత్వంలో బిహార్ ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్న జేడి,[ యు ] మంత్రివర్గంలో కొనసాగేందుకు నిరాకరించింది. గత రెండు మూడు రోజులుగా బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ , బీజేపీ చీఫ్ అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే చర్చల్లో భాగంగా నితిష్