వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసం

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకులో జరిగిన కుంభకోణంపై ఆ బ్యాంకు కస్టమర్లు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. సదరు బ్యాంకులో కుంభకోణానికి బాధ్యులైనా అధికారులపై భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని రోడ్లపైకి వచ్చారు.

పీఎంసీ స్కాం: 22 గదుల ఇళ్లు, మరో విమానం గుర్తించిన ఈడీపీఎంసీ స్కాం: 22 గదుల ఇళ్లు, మరో విమానం గుర్తించిన ఈడీ

బుధవారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 'నో బెయిల్.. ఓన్లీ జైల్' అని నినాదాలు చేస్తూ ముంబై ఎస్ప్లనడే కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు. అంతేగాక, కొందరు కస్టమర్లు ఆవేశంలో కోర్టు ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.

 No Bail, Only Jail: Upset With Lack of RBI Action, PMC Bank Customers Gather Outside Mumbai Court

బ్యాంకులో కుంభకోణం జరిగిన తర్వాత వినియోగదారులు తీసుకునే డబ్బుపై పరిమితిని విధించడంతో కస్టమర్లు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. కుంభకోణానికి కారణమైన వారిపై శిక్షలు వేయకుండా.. తమ ఎంతో కష్టించి సంపాదించిన డబ్బును తీసుకోవడంపై ఆంక్షలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా, పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితులైన హెచ్‌డీఐఎల్ డైరెక్టర్స్ సారంగ్ వాద్వాన్, రాకేష్ వాద్వాన్ లను పోలీసులు అక్టోబర్ 14 వరకు కస్టడీకి తీసుకున్నారు ముంబై పోలీసులు. పీఎంసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్ ను కూడా పోలీసుల కస్డడీలోనే ఉన్నారు.

పీఎంసీ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీలకమైన హౌసింగ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) ఉన్నతాధికారులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది. గత వారం హౌసింగ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) కంపెనీకి చెందిన ఓ ప్రైవేట్ జెట్, పలు కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సదరు కంపెనీ ప్రమోటర్లైన రాకేష్, సారంగ్ వాధ్వాన్‌లకు చెందినవి.

ఇక సోమవారం కూడా సోదాలు కొనసాగించింది ఈడీ. ఆలీభాగ్‌లోని 22 గదులు కలిగిన ఇల్లు, మరో విమానం, మాల్దీవుల్లో ఉన్న క్రీడలకు ఉపయోగించే ఓ బోటును ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులను కూడా త్వరలోనే ఈడీ అటాచ్ చేయనుంది. మహారాష్ట్రలోని ఖరీదైన ప్రాంతాల్లో అనేక ఇళ్లను రాజకీయ నాయకులకు ఈ కంపెనీ కానుకలుగా అందజేసినట్లు ఈడీ గుర్తించింది. అయితే, రాజకీయ నాయకుల పేర్లను మాత్రం ఈడీ వెల్లడించలేదు.

ఇక ముంబై పోలీసు శాఖలో భాగమైన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే పీఎంసీ స్కాంలో రూ. 4వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో చరాస్తులు, సేవింగ్ అకౌంట్స్, విలువైన ఆభరణాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు అయిన రాకేష్ వాద్వాన్, సారంగ్ వాద్వాన్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ. 4,355.43కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులపై ఆర్థిక ఉల్లంఘనల పోలీసు విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌లో పీఎంసీ బ్యాంక్ ఎండీ జాయ్ థామన్, మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి.

English summary
Customers of crisis-hit PMC Bank took to Mumbai’s streets once again on Wednesday to protest against the alleged inaction by the Reserve Bank of India (RBI) in the latest banking fraud to rock the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X