నగదు లేకున్నా..ఎస్ ఎం ఎస్ తో అన్నీ ఇంటికి వచ్చేస్తాయి.
గుజరాత్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.... గుజరాత్ లోని ఓ గ్రామప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను తెచ్చుకొంటున్నారు. చిన్న ఎస్ ఎం ఎస్ సహయంతో వారికి కావాల్సిన సరుకులు నేరుగా ఇంటికి వస్తున్నాయి. డబ్బుల కోసం వారు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు.
గుజరాత్ రాష్ట్రంలోని సబర్ కాంత జిల్లా అకోదర గ్రామం .దేశంలోనే తోలి డిజిటల్ గ్రామంగా ప్రసిద్ది చెందింది.ఈ గ్రామంలో 24 గంటల పాటు ఉచిత వైఫె ఉంది.ఈ గ్రామంలో కేవలం 1500 జనాభా.అయితే 1200 మందికి బ్యాంకు కాతాలున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆన్ లైన్ లో డబ్బులు జమచేయడం, తీసుకోవడం తెలుసు.
ఆన్ లైన్ లో బ్యాంకు లావాదేవీలు తెలుసుకోవడంతో వీరికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. చిన్న వస్తువుునైనా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తుంటారు. ఎవరికీ ఏం కావాలో ఆ వస్తువుల వివరాలను దుకాణదారుడికి ఎస్ ఎం ఎస్ చేస్తారు. ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తారు.
ఈ గ్రామంలో ఒకే ఒక్క ఎటిఎం ఉంది.కాని, ఈ ఎటిఎం వద్ద ఎలాంటి క్యూ లైన్లు ఉండవు.ఓ ప్రైవేట్ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డిజిటల్ విలేజ్ ప్రోగ్రాం కింద దత్తత తీసుకొన్నారు.దేశవ్యాప్గంగా నగదు కోసం ఇబ్బందులున్నా తమకు ఎలాంటి ఇబ్బందులు లేనవి స్థానికులు చెబుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.... గుజరాత్ లోని ఓ గ్రామప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను తెచ్చుకొంటున్నారు. చిన్న ఎస్ ఎం ఎస్ సహయంతో వారికి కావాల్సిన సరుకులు నేరుగా ఇంటికి వస్తున్నాయి. డబ్బుల కోసం వారు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు.