కేంద్ర బడ్జెట్ 2018: ఇటు తగ్గింపు, అటు పెంపు... వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం!
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గుతాయని భావించేలోపే కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై తగ్గే ఆ రూ.2ను సెస్కు మళ్లించింది. ఫలితం.. పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతధం.
కేంద్ర బడ్జెట్ 2018: వాహనదారులకు ఊరట.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2018-19 సాధారణ వార్షిక బడ్జెట్లో ఎంతో కొంత ఊరట కలిగిందని వాహనదారులు సంతోషించారు కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.
పెట్రోల్, డీజిల్పై రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే కదా. అయితే ఆ తగ్గించిన మొత్తాన్ని సెస్కు మళ్లించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టంచేశారు.
2 Rs excise on petrol and diesel is being reduced & this is being converted into cess, that is the only change we have made, practically there is no impact on the final price of petrol & diesel. To the consumers, there is no change: Hasmukh Adhia, Finance Secretary pic.twitter.com/U2HiUsd9pJ
— ANI (@ANI) February 1, 2018
బడ్జెట్లో విద్య, ఆరోగ్యంపై ఉన్న సెస్ను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ అటు పెరిగిన సెస్తో సమానమైంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. 'అమ్మ.. జైట్లీ.. ఎంతపనిచేశావయ్యా..' అని ముక్కున వేలేసుకోవడం తప్ప వాహనదారులు చేయగలిగిందేమీ లేదు.