వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పని నేను చేశా, అంతే: మన్మోహన్ నో కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన అలసత్వం వల్లనే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణాలు జరిగాయని ‘కాగ్‌' మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ చేసిన విమర్శలపై స్పందించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిరాకరించారు. ‘‘నా పని నేను చేశా. ఇతరులు ఏమి రాశారనే దానిపై నేను చెప్పేదేమీ లేదు'' అన్నారు.

తన కుమార్తె దమన్‌ సింగ్‌ రాసిన ‘స్ర్టిక్ట్‌లీ పర్సనల్‌ : మన్మోహన్‌ అండ్‌ గురుచరణ్‌' పుస్తకానికి సంబంధించి ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్‌ సింగ్‌ను మీడియా ప్రతినిధులు వినోద్‌ రాయ్‌ విమర్శలపై ప్రశ్నించారు.

No Comment, Says Manmohan Singh on Former CAG Vinod Rai's Criticism

2జీ స్పె క్ట్రం, బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినా మన్మోహన్‌ సింగ్‌ పట్టించుకోలేదని కాగ్‌ మాజీ చీఫ్‌ ఆరోపించారు. మన్మోహన్‌ సింగ్‌ కల్పించుకుని ఉంటే అసలు ఈ కుంభకోణాలు చోటు చేసుకుని ఉండేవే కావని తన పుస్తకంలో అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌పై కాగ్‌ మాజీ చీఫ్‌ చేసిన ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన తనయ దమన్‌ సింగ్‌ కూడా నిరాకరించారు. తన పుస్తకంలో తల్లి దండ్రులకు సంబంధించి అనేక వివరాలు వెల్లడించిన దమన్‌ సింగ్‌, ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ పదేళ్ల జీవితానికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు.

English summary
Former Prime Minister Manmohan Singh today declined to comment on former national auditor Vinod Rai's criticism of his alleged failure to check the spectrum and coal scams. "I, indeed, did my duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X