వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మా కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవు, వారిద్దరూ నా రెండు కళ్ళు '

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ తనకు రెండు కళ్ళ లాంటి వారని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా తెలిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ తనకు రెండు కళ్ళ లాంటి వారని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

సమాజ్ వాదీ పార్టీలో సాధన గుప్తా వల్లే సంక్షోభం నెలకొందనే ప్రచారం కూడ సాగింది. అయితే పార్టీలో నెలకొన్న సంక్షోభాలన్నీ సమసిపోయాయని ఆ కుటుంబసభ్యులు ప్రకటించారు.

'NO disputes in my family says Sadana gupta'

పార్టీలో తన చిన్న కోడలు అపర్ణ యాదవ్ ను మరో అధికార కేంద్రం చేయాలని సాధనా గుప్తా చక్రం తిప్పారనే ప్రచారం కూడ పార్టీలో ఉంది.అయితే అఖిలేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్నారు.

అఖిలేష్, ప్రతీక్ ఇద్దరూ నాకు రెండు కళ్ళు

సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభానికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్న సాధనా గుప్తా మీడియాతో మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతీక్ లు తనకు రెండు కళ్ళ లాంటి వారిని ఆమె చెప్పారు. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తొలి భార్య సంతానం. ప్రతీక్ సాధనా గుప్తా కొడుకు. అయితే ప్రతీక్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని చూపలేదు. దీంతో ప్రతీక్ భార్య అపర్ణను రాజకీయాల్లోకి సాధనా గుప్తా ప్రోద్బలం వల్లే వచ్చిందని చెబుతుంటారు. ఆదివారం నాడు కుటుంబసభ్యులతో ఓటు వేసిన తర్వాత ఆమె మీడియాతో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

English summary
NO disputes in my family says Sadana gupta on sunday in Uttar pradesh. Sadana gupta casting her vote with her family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X