భారత దేశంపై కక్ష తీర్చుకునే వరకు బక్రిద్ జరుపుకునే ప్రసక్తే లేదు...! మాజీ కశ్మీరీ ఐఏఎస్ అధికారి
జమ్ము కశ్మీర్ విభజనతోపాటు ఆర్టికల్స్ తొలగింపుపై ఎలాంటీ ఆందోళనలు లేకుండా స్థానిక ప్రజానీకం సర్ధుకుపోతుంటే, అక్కడి రాజకీయ పార్టీల నాయకుల్లో మాత్రమే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలతో హింసాత్మక మార్గాలకు పోకుండా సలహాలు, సూచనలు సూచనలు చేయాల్సిన రాజకీయా నాయకులు,మేధావులే ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేవలం కశ్మీర్ అంటే ఒక మతానికి చెందిన ప్రాంతంగా క్రియోట్ చేస్తున్నారు.
1947 నుండి దొంగతనంగా భారత దేశం ఎత్తుకెళ్లిన ప్రతి వస్తువు వెనక్కి తిరిగి రావడంతో పాటు, భారత దేశంపై కక్ష తీర్చుకునే వరకు ఈద్ పండగ జరుపుకోనని ట్విట్టర్లో పేర్కోన్న వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది. కరుడు గట్టిన ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు కాదు. పతి సంవత్సరాల క్రితం సివిల్ సర్వీసు ఉద్యోగంలో కశ్మీర్ రాష్ట్రంలో టాపర్గా నిలిచి, కొద్ది సంవత్సరాల పాటు కశ్మీర్లో పది సంవత్సరాలు పాటు విధులు నిర్వహించిన రాజీనామ చేసిన ఓ మాజీ ఉద్యోగి ట్విట్టర్లో పేర్కోన్నారు.
2009 సివిల్ సర్వీసులో టాపర్గా నిలిచిన షా ఫైజల్ అనే మాజి ప్రభుత్వ ఉద్యోగి రెచ్చగొట్టే విధంగా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశాడు. కాగా కొద్ది సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన అనంతరం ఫైజల్ రాజీనామ చేసి రాజకీయ పార్టీ పెట్టారు. అయితే ఫైజల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడీయాలో తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1947 కాదు 1000 సంవత్సరాల వెనక్కి వెళ్లమని సెటైర్టు వేశారు. కాగా బుద్దిస్టులను ,హిందువులను ముస్లింలు చంపివేశారని వాటిని కూడ పరిగణనలోకి తీసుకోవాలని చాల మంది రీ ట్వీట్ చేశారు.