మరో లొల్లి: తాత్కాలిక సీబీఐ బాస్గా నాగేశ్వరరావు నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
సీబీఐలో ఏర్పడిన ముసలం ఇంకా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కగా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టడం... బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఆయన్ను మరో శాఖకు బదిలీ చేయడం, ఆ తర్వాత ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడం అన్ని చకాచకా జరిగిపోయాయి. అనంతరం అడిషనల్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వరరావును జనవరి నెల వరకు మధ్యంతర సీబీఐ బాస్గా నియమిస్తూ ఉత్తర్వులు కేంద్రం జారీ చేసింది.ఈ క్రమంలోనే మరోసారి సీబీఐ వార్తల్లో నిలిచింది.
సీబీఐ డైరెక్టరుగా నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఎన్జీఓ సంస్థకు చెందిన ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్ నియామకం పారదర్శకతతో జరగాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సీబీఐ డైరెక్టరుగా నాగేశ్వరారావు పేరును హైపవర్ సెలెక్షన్ కమిటీ సూచించలేదని ఆయన నియామకం నేరుగా జరిగిందని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక నాగేశ్వరరావు నియామకం పూర్తి పారదర్శకతతో జరగలేదని అంజలి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఏకపక్షంగా జరిగిన నాగేశ్వరరావు నియామకం చెల్లదని ఆమె అన్నారు. ఇవి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అంజలీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ ద్వారా వేశారు.