ఆరుషి హత్య కేసు: సినిమా, పుస్తకానికి తల్లిదండ్రులు నో
ఈ అంశంపై మీడియాలో వచ్చిన వార్తలు ఈ దంపతులను ఎంతో ఆందోళనకు గురి చేశాయని, ఆరుషి కేసుపై హాలీవుడ్, లేదా బాలీవుడ్ సినిమా తీయడానికి వాళ్లు అనుమతించరని తల్వార్ దంపతుల న్యాయవాది మనోజ్ సిసోడియా అన్నారు.
కొంతమంది అంతర్జాతీయ, జాతీయ సినీ దర్శకులు, రచయితలు ఆరుషి కేసుపై సినిమా తీయాలని, పుస్తకం రాయాలని అనుకుంటున్నట్లు మీడియా వార్తల ద్వారా తమకు తెలిసిందని, తాము ఎంతగానో ప్రేమించే తమ కుమార్తె హత్యపై సినిమా తీసి డబ్బులు సంపాదించాలని కొంతమంది అనుకోవడం రాజేష్, నూపుర్లను ఎంతో ఆవేదనకు గురి చేసిందని సిసోడియా అన్నారు.
ఆరుషి హత్య కేసులో తమను దోషిగా పేర్కొనడంపై వాళ్లు ఇంకా షాక్కు లోనయి ఉన్నారని, వారిని ఓదార్చడం సాధ్యం కావడం లేదన్నారు. తల్వార్ దంపతుల అంగీకారం లేకుండా ఆరుషి కేసుపై సినిమా తీసినట్లయితే సంబంధిత డైరెక్టర్లు, రచయితలపై వాళ్లు చట్టపరంగా చర్య తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు.