వివాదం ముగిసింది.. ఇక ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా భవిష్యత్ ఎన్నికలు : ఉమా భారతీ
అయోధ్య వివాదం ముగిసింది. రాజకీయం ముగిసింది. ఇక ప్రజల నిజమైన కష్టాలపై ఎన్నికలు జరుగుతాయి. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలపై పార్టీలు ప్రస్తావించే అవకాశం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అయోధ్య వివాదంపై సుప్రిం వెలువరించిన తీర్పుపై ఆమే స్పందించింది.
అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ప్రసంగం మరికాసెపట్లో
గత కొన్ని సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం ప్రధాన ఎజెండా ఎన్నికలు జరిగాయని, భవిష్యత్లో రామమందిరం నిర్మాణంపై హామి ఇచ్చేందుకు అభ్యర్థులకు అవకాశం ఉండదని చెప్పింది. రానున్న ఎన్నికల్లో ఈ అవకాశం ఉండదని అన్నారు. మరోవైపు అయోధ్య విజయం వెనక పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్యానీ కృషి ఉందని ఆమె కొనియాడారు.
అయోధ్యపై గత దశాబ్దాల కాలంగా ప్రజల మనోభావాల నుండి రాజకీయ నాయకుల ప్రచార ఆస్త్రంగా మారింది. అనంతరం ఎన్నికల్లో ఎజెండాగా మారిన విషయం తెలిసిందే.. రామ మందిర నిర్మాణంపై మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ముఖ్యంగా ఉత్తారాదిలో జరిగే ప్రతి ఎన్నికల్లో రామమందిర నిర్మాణం ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరిగాయి.
సుప్రిం కోర్టు తీర్పుతో దేశంలో రెండు విభిన్న మతాలకు చెందిన వివాదం ముగిసిపోయింది. ఇక ప్రజల అభివృద్ది, మౌలిక వసతులపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ రాజకీయ ఎజెండా ఉన్న రామజన్మభూమీ వివాదం సమసి పోయిందని వ్యాఖ్యానించింది.