స్పష్టత: '2 వేల నోటును రద్దు చేయం, గుజరాత్, బెంగాల్ లోనే నకిలీ నోట్లు'
రెండు వేల రూపాయాల నోటును రద్దు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
న్యూఢిల్లీ: రెండు వేల రూపాయాల నోటును రద్దు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని అరికట్టేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది.
అయితే పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయాల కరెన్సీని ప్రవేశపెట్టింది. అయితే రెండు వేల రూపాయాల కరెన్సీ నకిలీ నోట్లు మార్కెట్ లోకి వచ్చాయి.దీంతో కొత్త రెండు వేల రూపాయాల నోట్లను కూడ రద్దు చేస్తారనే ప్రచారం సాగింది.
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త రెండు వేల రూపాయాల నోట్లను రద్దు చేసే ప్రశ్నేలేదని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

రెండు వేల నోట్లను రద్దు చేయం
నకిలీ నోట్లను ముద్రించారనే కారణాన్ని చూపుతూ రెండువేల నోట్లను రద్దు చేసే ప్రసక్తేలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు చెప్పారు.రెండువేల రూపాయాల నోట్లను రద్దు చేస్తామనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు మధుసూధన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.

నకిలీ కరెన్సీ సీజ్
నకిలీ రెండువేల రూపాయాలను సీజ్ చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ ఎక్కువగా పట్టుబడినట్టు ఆయన చెప్పారు.నకిలీ కరెన్సీని గుర్తుపట్టేందుకు అనేక మార్గాలున్నాయని మంత్రి చెప్పారు.కొత్త కరెన్సీని కాపీ చేయడం సాద్యం కాదన్నారు మంత్రి.

సెక్యూరిటీ ఫీచర్లే కొత్త కరెన్సీకి రక్షణ
కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన రెండువేలు, ఐదువందల రూపాయాల నోట్లు హై సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ కారణంగా వందశాతం నోట్లను కాపీ చేయడం సాధ్యం కాదని మంత్రి చెప్పారు. అయితే కొత్త కరెన్సీ నోట్లను పోలిన నోట్లను తయారు చేస్తున్నప్పటికీ, వందశాతం అదే తరహ నోటును ముద్రించలేరని మంత్రి ప్రకటించారు.

నకిలీ నోట్ల తయారీదారులపై కఠిన చర్యలు
కొత్త కరెన్సీ నోట్లను పోలిన నోట్లను తయారు చేసేవారిని కఠినంగా శిక్షించనున్నట్టుగా కేంద్ర మంత్రి రిజుజు ప్రకటించారు.నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసే అనుమానం ఉన్నవారిపై నిఘాను ఏర్పాటు చేశామన్నారు మంత్రి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications