నో వ్యాక్సిన్: వచ్చే ఏడాది వరకు మందు లేదు, పార్లమెంటరీ ప్యానెల్తో అధికారులు..
కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఆగస్ట్ 15వ తేదీ వరకు రెమ్డెసివర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే అధికారులు మాత్రం వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి శుక్రవారం అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమెట్ చేంజ్ సమావేశమైంది.
Recommended Video
కరోనా విలయం: అక్కడ మళ్లీ లాక్ డౌన్.. 235కొత్త కేసులతో పాట్నా బెంబేలు..
మార్చి 23వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి కమిటీ తిరిగి సమావేశం కాలేదు. లాక్ డౌన్ తర్వాత శుక్రవారం తొలిసారి పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కమిటీ ముందు హాజరైన అధికారులు కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి వివరించారు. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. ఇప్పట్లో రాదు అని పేర్కొన్నారు.
గత 24 గంటల్లో 73 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. 14 మంది కోలుకోగా.. మిగతా సిబ్బంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 73 మందితో కరోనా వైరస్ సోకిన మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లు సంఖ్య 1659కి చేరింది. 927 మందికి తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యారు.