70 ఏళ్ల అభివృద్ధి కాదు ... ఐదేళ్లలో ఏం చేశారు ? ప్రగతి నివేదిక ఇవ్వాలన్న ప్రియాంక
న్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల ప్రచారం మరింత హీట్ పెంచుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది. ఎన్నికల హామీలు, చేసిన పనులపై ప్రగతి నివేదిక ఇవ్వాలనే డిమాండ్లు వస్తోన్నాయి.
70 ఏళ్లలో ఏం చేశారు ? ఐదేళ్లలో చేసిందేంటీ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ సమయంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రియాంక గాంధీ స్పందిస్తూ .. 70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. కానీ అది ముగిసిన అధ్యాయం, గతం గురించి కాకుండా వర్తమానం గురించి ఆలోచిస్తే బెటర్. ఈ ఐదేళ్లలో మీరేం చేశారు అని ప్రియాంక కౌంటర్ అటాక్ చేశారు.
మోదీనా మజాకా .. చౌకిదార్ విమర్శను కూడా ప్రశంసలా వాడేస్తున్నారు
గంగా యాత్రపై విమర్శలు, ప్రియాంక కౌంటర్
ప్రియాంక గాంధీ గంగా నదీ గుండా ప్రచారాన్ని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ పిక్నిక్గా ఆరోపించారు. దీనిపై స్థానిక మీడియా ప్రతినిధిని ప్రియాంకను సమాధానం కోరగా స్పందిస్తూ ... ఇటలీలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు గత నాలుగేళ్లుగా వెళ్లలేదన్నారు. వాస్తవానికి తన బామ్మను చూడడానికి వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదని .. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రచార బరిలోకి దిగానని దినేశ్ ఆరోపణలకు ధీటుగా సమాదానం ఇచ్చారు.