8400 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ విమానం.. మరీ జవాన్లకు.. మోడీపై రాహుల్ విసుర్లు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైరయ్యారు. ప్రధాని వీఐపీ విమానం మాత్రం బుల్లెట్ ప్రూఫ్.. కానీ జవాన్లకు నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై రెండోరోజు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు 2 నిమిషాల నిడివిగల వీడియోను కూడా షేర్ చేశారు. జవాన్లకో న్యాయం.. ప్రధానికో న్యాయమా అంటూ రాహుల్ గాంధీ నిలదీశారు.
జవాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో యుద్ధానికి పంపుతున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మాత్రం రూ. 8400 కోట్లతో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ విమానం దిగుమతి చేశారని మండిపడ్డారు. ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నా.. నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తమను పంపిస్తున్నారని జవాన్లు ఆరోపించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
జవాన్లను తరలిస్తోన్న ట్రక్కు బాగేలోదని రాహుల్ తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు కంటిన్యూ చేశారు. అయితే వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలియజేస్తున్నారు. పంజాబ్ గుండా ట్రాక్టర్ ర్యాలీ కూడా తీశారు. అయితే ట్రాక్టర్పై రాహుల్ గాంధీ సోఫా వేసుకొని కూర్చొవడం కూడా మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశాన్ని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రస్తావించారు. ట్రాక్టర్ మీద సోఫాపై కూర్చొవడం నిరసన అవుతుందా అని అడిగారు. ఈ మేరకు నిరసన కూడా తెలియజేశారు.