ఇరాక్ సంక్షోభం, గ్యాస్ పెంపు: మోడీపై పొన్నాల ధ్వజం
కాగా, ధరలు పెరిగిన నేపథ్యంలో రాయితీ సిలిండర్ల ధరలు... ఢిల్లీలో రూ.922.50, ఉత్తర ప్రదేశ్లో రూ.906 ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) తెలిపింది. స్థానిక పన్నులతో కలిపి కోల్కతాలో రూ.966, ముంబైలో రూ.949.50, చెన్నైలో రూ.924 ఉంటుంది.
మోడీపై మండిపడ్డ పొన్నాల
సబ్సిడీయేతర సిలిండర్ల పెంపు నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రధాని నరేంద్ర మోడీ పైన మండిపడ్డారు. ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ నెల తిరక్కుండానే ద్రవ్యోల్భణం పెంచే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
పొన్నాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి నెల రోజులు అయిన్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తాము ఆంటోని కమిటీ ముందు పార్టీ పరిస్థితిని చర్చించేందుకు ఢిల్లీ వెళ్తుననట్లు చెప్పారు.