నాకు ఎలాంటీ బాధ్యతలు ఇవ్వద్దు ... అరుణ్ జైట్లీ
శ్వాస ఉన్నంతవరకు రాజకీయల్లో అధికారాన్ని కొనసాగాలని కోరుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు, అయితే అందుకు విరుద్దంగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అనంతరం ఆలేఖ ప్రతిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
I have today written a letter to the Hon’ble Prime Minister, a copy of which I am releasing: pic.twitter.com/8GyVNDcpU7
— Arun Jaitley (@arunjaitley) May 29, 2019
మోడీ ప్రభుత్వంలో కీలక ఆర్ధికశాఖ భాద్యతలు నిర్వహించిన అరుణ్ జైట్లీ రెండవసారీ అధికారం చేపడుతున్న ప్రభుత్వంలో మాత్రం అనారోగ్యం రిత్యా ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండనున్నారు. కాగా గత సంవత్నరన్నర కాలంగా ఆనారోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోంటున్నానని డాక్టర్ల సలహా మేరకు భవిష్యత్లో కొంతకాలం తన ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కోన్నారు. ఇలాంటీ నేపథ్యంలో తాను ప్రభుత్వంలో ఏలాంటీ బాద్యతలు చేపట్టలేనని తెలుపుతూ మోడీకి లేఖ రాశారు. అయితే ఇదే విషయాన్ని మోడీకి నేరుగా చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు.
ఆయన ఇప్పటి వరకు ఆర్దిక మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో జీఎస్టీలాంటీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..