వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణంపై సొంత పార్టీలోని నాయకులు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణంపై సొంత పార్టీలోని నాయకులు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు సెల్లూరు రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జయలలిత మృతి మిస్టరీ వీడేనా: విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వం, శశికళ బెదిరించారు!జయలలిత మృతి మిస్టరీ వీడేనా: విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వం, శశికళ బెదిరించారు!

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తనతో పాటు మంత్రులు అందరూ చూశారని, తాను కూడా అనేక సార్లు చూశానని మంగళవారం మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాటి మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదని సెల్లూరు రాజు మీడియా ముందు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 Not only myself all the ministers saw Jayalalitha in the hospital Sellur Raju

జయలలిత మరణంపై విచారణ కమిషన్ దర్యాప్తు మొదలు పెట్టిందని, ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అమ్మను చూశామా ? లేదా ? అనే విషయంపై తాను ఏమీ మాట్లాడనని తమిళనాడుకు చెందిన మరో సీనియర్ మంత్రి ఆర్ బి. ఉదయ్ కుమార్ మీడియాకు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రులు జయలలిత మరణం విషయంలో ఒక్కొక్కరు ఒకో రకంగా మీడియా ముందు మాట్లాడటంతో తమిళనాడు ప్రజలు, అమ్మ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Not only myself all the ministers saw Jayalalitha in the hospital. Initially Minister Dindugul Srinivasan said no one met Jayalalitha in the Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X