మైనారిటీలో ఉన్న తమిళనాడు ప్రభుత్వం రద్దు ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సందర్బంగా అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మొదటి సారి స్పంధించింది.
సీఎం పళనిసామికి రిలీఫ్: దినకరన్ ఎమ్మెల్యేలకు గవర్నర్ ఝలక్: ప్రతిపక్షాలకు షాక్!
తమిళనాడు ప్రభుత్వాని రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ నాయకులు అక్కడి సమస్యలను పరిష్కరించుకుంటారని, మేము జోక్యం చేసుకోమని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు ఢిల్లీ చేరుకునిన కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంలో మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్ నాథ్ సింగ్ పై విధంగా సమాధానం ఇవ్వడంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. మరో వైపు తమిళనాడు మంత్రులు కావాలనే ఢిల్లీ వెళ్లి మా మీద లేనిపోని ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని చెన్నైలో టీటీవీ దినకరన్ మండిపడ్డారు. ప్రజల మద్దతు మాకే ఉందని దినకరన్ ఇప్పటికీ ధీమాగా చెబుతున్నాడు.