ఇండియాలో ధనవంతుడు ముఖేష్ అంబానీ, 11 మంది బిలీయనీర్ నుండి కిందికిలా...
ఇండియాలో ఇటీవల చోటుచేసుకొన్నపరిణామాల నేపథ్యంలో 11 మంది బిలీయనీర్ ట్యాగ్ ను కోల్పోయారు. ఈ మేరకు తాజా సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ముఖేస్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొన్న నిర్ణయంతో 11 మంది తమ బిలీయనర్ ట్యాగ్ ను కోల్పోయారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నోట్ల రద్దుతో బిలీనియర్ జాబితా నుండి కిందకు పడిపోయినట్టు తాజా సర్వేలో వెల్లడించారు.
అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నోట్ల రద్దుతో బిలీనియర్ జాబితా నుండి కిందకు పడిపోయినట్టుగా తాజా సర్వే వెల్లడిస్తోంది.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం నాడు విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వం తీసుకొన్న క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొందని హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రీసెర్చర్ మేనేజింగ్ డైరెక్టర్ రెహమాన్ జునైడ్ తెలిపారు.
పారదర్శకమైన కరెన్సీ ఎకనామిక్స్ పారిశ్రామికవేత్తల్లో సానుకూల ప్రభావాన్ని నెలకొల్పుతోందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హుదున్ గ్లోబల్ రీచ్ లిస్ట్ విడుదల చేసిన రిచెస్ట్ ఇండియన్స్ 2017 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు.
గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఆయన 28 వ, స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత దేశీయంగా రెండో ర్యాంకింగ్ లో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామీలీ, మూడో స్థానంలో దిలీప్ సంఘ్వీ, నాలుగో స్థానంలో పల్లోజీ మిస్త్రీ నిలిచారు. ఈ రిపోర్ట్ ప్రకారంగా 132 మంది భారతీయులు లేదా భారత సంతతి బిలీయనర్ల సంపద 1 బిలియన్ డాలర్లులేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
42 మంది బిలీయనీర్లకు ముంబై కేంద్రంగా మారింది. దాని తర్వాత న్యూఢిల్లీ, అహ్మాదాబాద్ లు నిలిచాయి. గ్లోబల్ గా బీజింగ్, న్యూయార్క్ ను అధిగమించింది .బిలియనీర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా బీజింగ్ అగ్రస్థానంలో నిలిచింది.