కారణమిదే: 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా తీసుకొంటున్న చర్యలను వివరించాలని కేంద్రం ఆ కంపెనీలకు కోరింది.
మోటోరోలా, అసుస్హనర్, వన్ప్లస్, కూల్ప్యాడ్, ఇన్ఫోకస్, బ్లూ , ఒప్పో, నుబియాలున్నాయి. ఇదే విషయమై కంపెనీలకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది.
వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.డివైజ్ను తయారుచేసినప్పుడు వారు తీసుకొంటున్న భద్రతా చర్యల గురించి తెలపాలని కోరింది.
ఆయా కంపెనీలు తమ వివరణ తెలిపేందుకు ఈ నెల 28వ, తేది వరకు గడువిచ్చింది. సమయం ఇచ్చినట్టు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
మొబైల్ఫోన్ల నుండి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్లను వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్వేర్ యాప్స్ను నిశితంగా పరిశీలిస్తారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో స్మార్ట్ఫోన్ భద్రత విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది.డొక్లామ్ వద్ద ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.