కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సాధ్యపడదు..అక్కడ భిన్నాభిప్రాలు ఉన్నాయి..
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు కేంద్రమాజీ మంత్రి చిదంబరం .ప్రజాభిప్రాయం జరగాలని ప్రతిపాదన వచ్చినప్పుప్పటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు తేడా ఉందని ఆయన పేర్కోన్నారు.
నేహ్రు కాలానికి ఇప్పటికే కాశ్మీర్ లో తేడా వచ్చింది.
కాశ్మీర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు నేహ్రూ కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణకు అంగీరించారని చెప్పారు. ప్రస్థుతానికి కాశ్మీర్ లో కొంత భాగం పాకీస్తాన్ ఆధీనంలో ఉందని అన్నారు. దీంతో అక్కడ చాల మార్పులు వచ్చాయని పేర్కోన్నారు. ప్రస్థుతం జమ్ము కాశ్మీర్ లో ని లడఖ్, లేహ్ ,కార్గిల్ , తోపాటు ఓక్కో ప్రాంతంలో ఒక్కో అభిప్రాయం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ ప్రజలు భారత్ లో ఉంటూనే తమకు మరిన్ని అధికారాలు కావాలని కోరుకుంటున్నారని చిదంబదరం అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ తోచర్చలు జరపడం మినహ వేరే దారిలేదు.
కాగా ప్రస్థుత పరిస్థితుల్లో పాకిస్థాన్ తో చర్చలు జరపడం మినహా వేరే మార్గం లేదని ఆయన పేర్కోన్నారు.. ఈ సందర్భంగా ఆ దేశంతో చర్చలు జరపడం చాల సున్నితమైన అంశమని పేర్కోన్నారు.కాగా యుద్దం పరిష్కారం చూపదని అన్నారు.
పాక్ ప్రభుత్వం లో ఇతర శక్తులు
పాకిస్థాన్ లో ప్రభుత్వం తోపాటు ఆర్మీతోపాటు ఇతర వ్యక్తులు మరియు జైష్ ఏ మహ్మద్ లాంటీ ఉగ్రవాద సంస్థలు సైతం పాలనాపరమైన విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఉధ్ఘటించారు. ఈనేపథ్యంలో చర్చలు జరపడం కష్టతరమైన వాటిని కొనసాగితస్తూనే ఉండాలని ఆయన సూచించారు.
చెన్నైలో జరిగిన డి ఎమ్ కే నిర్వహించిన ఓ పుస్తక అవిర్బావ కార్యక్రమంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.