వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ వంతు అయ్యింది...ఇప్పుడు ఓవైసీ హనుమాన్ చాలీసా పటిస్తారు: కపిల్ మిశ్రా ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో బీజేపీ నేతలు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రచారం నుంచి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో కపిల్ మిశ్రాను ఈసీ హెచ్చిరంచింది.

Recommended Video

Delhi Assembly Elections Opinion Poll : AAP to Win 54-60 out of 70 seats, BJP May Bag 10-14

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను హనుమంతుడి భక్తుడా అని అడుగగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాను ఇప్పటికీ హనుమాన్ చాలీసా పటిస్తానని సమాధానంగా చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌ మాటలను ఉటంకించిన కపిల్ మిశ్రా దేశమంతా ఐక్యమైతే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కూడా హనుమాన్ చాలీసా పటిస్తారని అన్నారు. ఈ మేరకు కపిల్ మిశ్రా ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసాను పటిస్తానని చెప్పుకున్నారని, ఇప్పుడు ఓవైసీ కూడా పటించడం ప్రారంభిస్తారని చెప్పారు.

Now Owaisi will chant Hanuman Chalisa,kapil mishra tweets

ఐక్యమత్యంగా ఉంటే తెలియని శక్తి ఏదో ఉంటుందని, ఐక్యంగా ఉండి బీజేపీకి ఓటు వేయాలని కోరారు కపిల్ మిశ్రా. 20శాతం ఓటు బ్యాంకు ఉన్నవారు కుట్రలకు పాల్పడుతున్నారని ఆ నీచరాజకీయాలకు చెక్ పెట్టాలంటే అంతా ఏకం కావాలని కపిల్ మిశ్రా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ గతవారం కపిల్ మిశ్రాను 48 గంటల పాటు ప్రచారం నుంచి నిషేధం విధించింది. వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన కపిల్ మిశ్రా ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.

జనవరి 22, 23 తేదీల్లో కపిల్ మిశ్రా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ప్రచారం నుంచి మిశ్రాపై 48 గంటల పాటు నిషేధం వేటు వేసింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికలు భారత్ పాకిస్తాన్‌ల మధ్య పోటీగా చూడాలని ట్వీట్ చేశారు. ఢిల్లీలో చిన్న చిన్న ప్రాంతాలను పాకిస్తాన్‌గా మారాయని అన్నారు. పాకిస్తాన్‌కు ప్రవేశద్వారంగా షాహీన్‌ బాగ్ ఉందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆప్‌ పార్టీలు షాహీన్‌బాగ్‌ను పాకిస్తాన్‌గా తయారు చేశారని ట్వీట్ చేశారు. కపిల్ మిశ్రా ట్వీట్లపై నెటిజెన్లు కూడా తమదైన శైలిలో ట్వీట్ చేశారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.

English summary
Kapil Mishra has said that after Kejriwal, even Asaduddin Owaisi will start chanting the Hanuman Chalisa if the "majority" stands united.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X