మీకు తెలుసా?: ఇలా చేస్తే.. పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు హడలెత్తిపోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతోపాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు ఏమాత్రం తగ్గడం లేదు.
అంతేగాక, రోజువారీ ఇంధన ధరల సమీక్ష జరుగుతున్నప్పటి నుంచీ రేట్లు మరింత పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెల్లడించింది.
Buying #Petrol & #Diesel will get cheaper for you if you have this app...#DigitalPayments #DigitalIndia pic.twitter.com/aohTFS8Seb
— Digital India (@_DigitalIndia) September 19, 2017
ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ను ఇంధన చెల్లింపులకు వాడితే.. లీటర్ పెట్రోల్పై రూ.49పైసలు, లీటర్ డీజిల్పై రూ. 41 పైసలు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంతేగాక, బ్యాంక్ కార్డులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తించనుందని తెలిపింది.