వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఏటీఎం నుంచి ఒకవైపు ప్రింట్ అయిన రూ.500 నోట్లు

ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు తీయగా ఒక వైపు ముద్రించి ఉన్న రూ.500 నోటు వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు తీయగా ఒక వైపు ముద్రించి ఉన్న రూ.500 నోటు వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హేమంత్ సోని అనే వ్యక్తి ఖర్గోన్ జిల్లాలోని సెగోన్ జిల్లాకు చెందిన వాడు.

నోట్ల రద్దు: ఎస్బీఐ తీపి కబురు, అరుంధతి హామీ

అతను స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ రూ.1500 డ్రా చేశాడు. అతని చేతికి మూడు రూ.500 నోట్లు వచ్చాయి. అయితే, అందులో రెండు అయిదు వందల నోట్లు ఒక వైపు మాత్రమే ప్రింట్ చేయబడి ఉండటాన్ని అతను గుర్తించాడు.

Now, Rs 500 note with one printed side found in Madhya Pradesh

మహాత్మా గాంధీ ఇమేజ్ ఉన్న సైడ్ మాత్రం ప్రింట్ అయి, రెండో వైపు తెల్ల కాగితంగా ఉంది. అతను ఈ విషయాన్ని వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా, వారు మార్చి ఇచ్చారు.

దీనిపై బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. దాదాపు ఇలాంటి నాలుగు నోట్లు తమ దృష్టికి వచ్చాయని, వాటిని మార్చి ఇచ్చామని చెప్పారు. మిగతా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు.

English summary
Now, Rs 500 note with one printed side found in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X