వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం స్పందించకపోతే.. 'మా మూత్రం మేమే తాగుతాం': తమిళ రైతుల నిరసన

కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామంటూ రైతులు ఆందోళన చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరువు నిధుల విడుదల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల వినూత్న నిరసన కొనసాగుతోంది. శనివారం నాడు యూరిన్ బాటిల్స్ తో రైతులు నిరసన తెలియజేయడం గమనార్హం. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామని, తమ మలం తామే తింటామని రైతులు ఆందోళన చేశారు.

ఇంత తీవ్రంగా సమస్య పోరాడుతున్నా.. కేంద్రం నుంచి స్పందన లేదని, కనీసం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరువు నిధులతో పాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 14నుంచి ఢిల్లీలో వారి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Now, Tamil Nadu farmers to drink urine, eat faeces at Delhi’s Jantar Mantar

కాగా, ఈ నిరసనలో భాగంగా గతంలో కపాలాలతోను, నగ్నంగాను, చనిపోయిన ఎలుకలు, పాములతోను రైతులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రైతుల నిరసనపై స్పందించిన ప్రభుత్వం తమిళనాడుకు రూ.2వేల కోట్లు విడుదల చేసినా.. అవి తమకు సరిపోవని రైతులు వాదిస్తున్నారు. ఆ సహాయం సరిపోదని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
The protest by Tamil Nadu farmers at Jantar Mantar is set to go from curious to revolting as the protesters vowed to drink their urine on Saturday if the government did not pay heed to their demands. Determined to get heard, they also said that if they are still ignored by the Centre, they will be forced to eat human faeces on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X