నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం మరో అడుగు, ఎన్నారైలు షాక్
కేంద్ర ప్రభుత్వం ఎన్నారైలకు షాక్ ఇచ్చింది. నల్లధన నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో చర్య తీసుుకున్నది. విదేశాలలో ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు కలిగివున్న భారతీయులకు ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరంగా మారనుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్నారైలకు షాక్ ఇచ్చింది. నల్లధన నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో చర్య తీసుుకున్నది. విదేశాలలో ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు కలిగివున్న భారతీయులకు ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరంగా మారనుంది.
విదేశాలలో ఉంటున్న భారతీయులు తమ ఆదాయ ధృవీకరణ పత్రాల్లో.. విదేశాల్లో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లు, ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిబంధన ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. విదేశాల్లో ఉన్న ఆస్తులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వివరాలను మాత్రం తప్పని సరిగా తెలియజేయాల్సి ఉంటుంది.
తక్కువ కాలం పని చేయడానికి వెళ్లిన వలస జీవులతో సహా ఉద్యోగాలు చేసే ఎన్నారైలు కూడా ఈ మేరకు వివరాలను తెలిజేయాల్సి ఉంటుంది. నల్లధనాన్ని అరికట్టే చర్యలలో భాగంగా అక్రమ సొమ్ముని పసిగట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నారైలకు కేంద్రప్రభుత్వం తెలిపింది.
అయితే ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, విదేశాల్లో ఉంటూ నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఈ నిబంధన ఇబ్బందికరంగా మారనుందని డెలోయెట్టే హస్కిన్స్ అండ్ సేల్స్ పార్ట్నర్ నీరూ అహుజా అభిప్రాయపడ్డారు.