వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు డిస్పోజ్
న్యూఢిల్లీ: డీఆర్ డీవో భవన్ కు నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి డీఆర్ డీవో భవన్ ఆవరణం నుంచి ఓ శక్తివంతమైన బాంబును అక్కడి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఆ బాంబును తమ సిబ్బంది డిస్పోజ్ చేశారని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్ జీ) చీఫ్ ఆర్.సి.తయాల్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బాంబును డిస్పోజ్ చేయడం వేరే ఏ ఏజెన్సీకి సాధ్యం కాలేదని చెప్పారు.
చివరికి తమ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి బాంబును డిస్పోజ్ చేశారని అన్నారు. ఏప్రిల్ 14వ తేదిన డీఆర్ డీవో భవన్ ఆవరణంలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న సమయంలో ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. డిస్పోజ్ చేసిన బాంబు రెండో ప్రపంచ యుద్దం నాటిదని తేలిందని ఆయన వివరించారు.
English summary
According to the home ministry’s daily report, three 120 mm shells of World War II vintage were found on April 14.
Story first published: Wednesday, August 24, 2016, 15:31 [IST]