నన్పై గ్యాంగ్ రేప్: సీసీటీవిలో నిందితుల ఆధారాలు, ఇద్దరు అరెస్టు
కోల్కత్తా: నగరంలోని 72 ఏళ్ల క్రైస్తవ సన్యాసి(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఈ సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందుతులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్ ఆధారంగా సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు.
మరికొంతమందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇంతలోగా నిందితులకు సంబంధించిన ఆధారాలు తెలిపిన వారికి రూ. లక్ష నజరానాని అందిస్తామని ప్రకటించారు. కోల్కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్లో 71 సంవత్సరాల నన్పై కొంత మంది సామూహిక అత్యాచారం చేశారు.
అర్ధరాత్రి సుమారు 12:30 నిమిషాల ప్రాంతంలో రాణా ఘాట్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండు మంది దొంగల్లో నలుగురు నన్పై సామూహిక అత్యాచారం చేసి, లాకర్లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఐడీ విచారణకు ఆదేశించారు.