దారుణం: నర్సుపై ముగ్గురు యువకుల అత్యాచారం
జైపూర్: ముగ్గురు యువకులు 28 ఏళ్ల నర్సుపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రామ్బాగ్ సర్కిల్లోని ఎస్ఎంఎస్ స్డేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
జైపూర్లోని ఓ ఆస్పత్రిలో మహిళ నర్సుగా పనిచేస్తుంది. రోజులాగే ఆమె ఆసుపత్రికి బయల్దేరి వెళ్తుండగా మార్గం మధ్యలో ముగ్గురు యువకులు బైకుపై వచ్చి ఆమెను వెంబడించి ఎత్తుకెళ్లారు. ఆ మహిళను ఎస్ఎంఎస్ స్టేడియంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు సంగనీర్ ప్రాంతంలో నివసిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 365 (అపహరణ), 323 (వేధింపులు), 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.