వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: నర్సుపై ముగ్గురు యువకుల అత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: ముగ్గురు యువకులు 28 ఏళ్ల నర్సుపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రామ్‌బాగ్ సర్కిల్‌లోని ఎస్ఎంఎస్ స్డేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో మహిళ నర్సుగా పనిచేస్తుంది. రోజులాగే ఆమె ఆసుపత్రికి బయల్దేరి వెళ్తుండగా మార్గం మధ్యలో ముగ్గురు యువకులు బైకుపై వచ్చి ఆమెను వెంబడించి ఎత్తుకెళ్లారు. ఆ మహిళను ఎస్‌ఎంఎస్ స్టేడియంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Nurse gangraped by 3 youths in Jaipur, Rajastan

బాధితురాలు సంగనీర్ ప్రాంతంలో నివసిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 365 (అపహరణ), 323 (వేధింపులు), 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

English summary
A 28-year-old married nurse was allegedly gangraped by three youths near SMS stadium gate here, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X