ఆస్పత్రిలో విదేశీ యువతికి లైంగికవేధింపులు: అరెస్ట్
బెంగళూరు: ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి 10మంది విద్యార్థినులు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోంకు తరలించారు.
ఈ సమయంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై ఆస్పత్రిలో పని చేస్తున్న సుమీత్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు విద్యార్థిని స్నేహితుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు సుమీత్ను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.