ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల విధానం అవసరం లేదన్న నితిన్ గడ్కరీ..
ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి సంఖ్యల విధానాన్ని మరోసారి ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన కాసేపటికే కేంద్ రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాలుష్య నివారణకు సరి బేషి సంఖ్యల విధానాన్నిప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో నిర్మించిన రింగ్ రోడ్డు నగరంలో కాలుష్యాన్ని తగ్గించిందని ఆయన ప్రవేశపట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ప్రణాళికల ద్వార కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
మొత్తం సినిమా అయిపోయేటప్పటికీ దేశం దివాళా తీస్తుందేమో: మోడీపై కౌంటర్ అటాక్
రానుంది నవంబర్ నెల ఓ దీపావళీ మరోవైపు ఢిల్లీ చుట్టు దట్టంగా పొగ అల్లుకునే రోజులు. దీంతో ఢిల్లీ నగరం రానున్న రెండు నెలలు కాలుష్యకొరల్లో చిక్కుకునే రోజులు కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి సరి-బేసి సంఖ్యల వాహనాల రిజిస్ట్రేషన్ ఉన్న వాహానలను రోడ్లపై తిరిగేందుకు అనుమతిని ఇస్తారు. ఈనేపథ్యంలో సరిసంఖ్యలతో ముగిసే వావానాలు ఒకరోజు, బేసి సంఖ్యలతో తిరిగే వాహానాలు మరోరోజు రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం వల్ల వాయు కాలుష్యాం తగ్గుతుందనేది అధికారుల అంచన.
ఇలా పది రోజుల పాటు వాహానాలు అనుమతించిన తర్వాత దాని ఫలితాలను బట్టి సరి-బేసి సంఖ్యల విధానాన్ని కొనసాగించాల వద్ద అనేది తేలుస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు కాలుష్యం నుండి తట్టుకునేందుకు ప్రతి ఒక్కరికి మాస్కులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాగా ఇలాంటీ విధానాన్ని గతంలో కూడ సీఎం కేజ్రీవాల్ తీసుకువచ్చారు. అయితే ఆయన తీసుకువచ్చే విధానం అవసరం లేదని నితిన్ గడ్కరీ పేర్కోనడం గమనార్హం.