ఒడిశాలో ఘోర ప్రమాదం: 30 మంది ప్రయాణీకులతో నదిలో పడిన బస్సు
భువనేశ్వర్: ఒడిశాలోని కటక్లో పెను ప్రమాదం సంభవించింది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. బస్సు నదిలో పడిన సమయంలో 30 మందికి పైగా ప్రయాణీకుల వరకు ఉన్నారు.
Odisha: 7 people died after a bus carrying around 30 passengers fell from the Mahanadi bridge near Jagatpur in Cuttack today. Rescue operations underway; Latest #visuals from the spot pic.twitter.com/5V1Ow2zFww
— ANI (@ANI) November 20, 2018
నిచ్చెనల సాయంతో నదిలో పడిపోయిన వారిని కాపాడారు. విషయం తెలియగానే రెస్క్యూ సిబ్బంది అక్కడకు వెళ్లింది. అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఎద్దును ఢీకొట్టిన అనంతరం బస్సు నదిలో పడినట్లుగా తెలుస్తోంది.
ఆ బస్సు ఏసీ వాహనం. దీంతో ప్రయాణీకులు అందరు బస్సులోనే చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వంతెన పైనుంచి సుమారు నలభై అడుగుల దిగువన నదిలో బస్సు పడిపోయింది. ఘటనా స్థలంలో విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్లను సిద్ధం చేశారు.