వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో ఘోర ప్రమాదం: 30 మంది ప్రయాణీకులతో నదిలో పడిన బస్సు

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశాలోని కటక్‌లో పెను ప్రమాదం సంభవించింది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. బస్సు నదిలో పడిన సమయంలో 30 మందికి పైగా ప్రయాణీకుల వరకు ఉన్నారు.

నిచ్చెనల సాయంతో నదిలో పడిపోయిన వారిని కాపాడారు. విషయం తెలియగానే రెస్క్యూ సిబ్బంది అక్కడకు వెళ్లింది. అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఎద్దును ఢీకొట్టిన అనంతరం బస్సు నదిలో పడినట్లుగా తెలుస్తోంది.

Odisha: Bus carrying 30 falls from bridge in Cuttack

ఆ బస్సు ఏసీ వాహనం. దీంతో ప్రయాణీకులు అందరు బస్సులోనే చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వంతెన పైనుంచి సుమారు నలభై అడుగుల దిగువన నదిలో బస్సు పడిపోయింది. ఘటనా స్థలంలో విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.

English summary
In a tragic incident, a bus carrying 30 passengers fell from Mahanadi bridge near Jagatpur in Odisha’s Cuttack on Tuesday. Rescue teams have reached the spot. Several passengers have been seriously injured in the accident, reports suggested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X