వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విన్నపాలు వినవలె: మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధానిని కలిసిన సీఎం

|
Google Oneindia TeluguNews

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీని కలిశారు. ఫొణి తుఫాను తర్వాత పట్నాయక్ ప్రధానిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత తమ రాష్ట్ర సమస్యలపై మోడీతో చర్చించారు. ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు. ఫొణి తుఫానుతో తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఫొణి తుఫానుతో రాష్ట్రానికి రూ.11,900 కోట్లు మేరా నష్టం వాటిల్లినట్లు పట్నాయక్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనను కలిసినప్పటి ఫోటోను ప్రధాని మోడీ ట్విటర్‌లో పోస్టు చేశారు. నవీన్ పట్నాయక్ రాష్ట్రపతిని ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఇదిలా ఉంటే ఫొనీ తుఫాను ఒడిషా రాష్ట్రాన్ని అతలా కుతలం చేయడంతో ఎన్నికల నిబంధన ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం అనుమతితో ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

Odisha CM meets PM Modi, Requests special status to the state

ఫొని తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడమే కాక 60 మంది ప్రాణాలను కూడా తీసింది. ఇదిలా ఉంటే ఫొణి తుఫాను వస్తుందని తెలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్టాన్ని మరింత నియంత్రించినందుకు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను మోడీ కొనియాడారు.ఆసమయంలో ఒడిషాను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ వెంటనే రూ.1000 కోట్లను విడుదల చేశారు.

2000 నుంచి ఒడిషాలో బీజేడీ ప్రభుత్వమే ఉంది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 112 స్థానాల్లో విజయం సాధించి తిరిగి నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ సారి బీజేపీ కూడా ఎన్నడూ లేనంతగా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటింది. ఏకంగా 8 స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. 12 స్థానాల్లో బీజేడీ గెలువగా ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అసెంబ్లీ సీట్లు చూస్తే బీజేపీకి 23 స్థానాలు రాగా కాంగ్రెస్ 9 స్థానాల్లో నెగ్గింది.

English summary
After being sworn-in as the Chief Minister of Odisha for the fifth consecutive time, BJD supremo Naveen Patnaik Tuesday met Prime Minister Narendra Modi and congratulated him for his electoral victory in the General Elections.The CM requested PM Modi to award Odisha special category status, months after Cyclone Fani tore through the coastal city. The Odisha government has pegged the total losses in the state at over Rs 11,900 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X