ఉమెన్స్ డే: స్వయం సహాయక గ్రూపులకు ప్రత్యేక శాఖ: ఒడిశా సర్కారు కీలక నిర్ణయం
భువనేశ్వర్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల స్వయం సహాయక గ్రూపులను మరింత బలోపేతం చేసేందుకు కొత్త శాఖ 'మిషన్ శక్తి'ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మిషన్ శక్తి, ఒడిశా జీవనోపాధి మిషన్(ఓఎల్ఎం) డైరెక్టరేట్ను మిషన్ శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ గ్రీవెన్స్ విభాగం నుంచి వచ్చిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మార్చి 8l అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ స్వయం సహాయక గ్రూపుల(ఎస్హెచ్జీ)కు కొత్త శాఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించనున్నారు. మహిళ స్వయం సహాయక గ్రూపులను మరింత బలోపేతం చేసేందుకు ఈ శాఖ ఎంతగానో ఉపయోగపడనుందని సమావేశం అనంతరం ఓ అధికారి తెలిపారు. అవకతవకలు జరిగే అవకాశాలు కూడా ఉండవని అన్నారు.
మహిళ స్వయం సహాయక గ్రూపుల కోసం పట్టణ, గ్రామీణ ఈ శాఖ సమర్థవంతంగా పనిచేయనుందని అధికారులు తెలిపారు. మిషన్ శక్తి 2001 నుండి స్వయం సహాయక ఉద్యమానికి గొడుగు మాదిరిగా ఉందని తెలిపారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఇ-వేలం ద్వారా విక్రయించడానికి ఉద్దేశించిన మొత్తం బాక్సైట్ ధాతువును దీర్ఘకాలిక అనుసంధాన సరఫరాదారు వేదాంత లిమిటెడ్కు విక్రయించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీ లిమిటెడ్ స్టీల్ అండ్ మైన్స్ విభాగం నుంచి వచ్చిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమ్మకపు ధర మెట్రిక్ టన్నుకు రూ .1000 ఉంటుంది.
అలాగే, ఒరిస్సా హైకోర్టు నిర్దేశించిన విధంగా అవకలన రేటును చెల్లించే బాధ్యతను ఓఎంసీ అందిస్తుంది. ఇది 2020-21 సంవత్సరంకు పరిమితం చేయబడిన వన్-టైమ్ కొలతగా జరుగుతుందని అధికారి తెలిపారు.