లోయలోపడ్డ బస్సు.. 25 మందికి గాయాలు -ఒడిశా, కందమాల్ జిల్లాలో ఘటన
వారం రోజుల వ్యవధిలోనే ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈనెల 14న(సోమవారం) కలహండి నుంచి హైదరాబాద్ వస్తోన్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 40 మందికిపైగా గాయపడి, అందులో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. తాజాగా శుక్రవారం మరో సంఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు..
ఒడిశాలో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కందమాల్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని పుల్వాని నుంచి రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని గడియపాడఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది.
పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్లో చూసి షాక్ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి
Recommended Video
దీంతో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.