కుప్పకూలిన శిక్షణ విమానం: కెప్టెన్, మహిళా ట్రైనీ మృతి
భువనేశ్వర్: ఒరిస్సాలోని ఢెంకనల్లో సోమవారం ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఓ పైలట్ సహా శిక్షణలో ఉన్న యువతి మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఢెంకనల్ జిల్లాలోని బిరసల్ వైమానిక స్థావరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు.
బీహార్కు చెందిన కెప్టెన్ సంజీబ్ కుమార్ ఝా, తమిళనాడుకు చెందిన అనీషా ఫతీమాలు ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Odisha: Captain Sanjib Kumar Jha from Bihar and Anis Fatima, a trainee pilot from Tamil Nadu, lost their lives after a trainer aircraft crashed today at Birasal Airstrip under Kankadahad police station limits in Dhenkanal district. Bodies have been sent for postmortem. pic.twitter.com/nWez7FVmCu
— ANI (@ANI) June 8, 2020
Recommended Video
ఈ స్థావరం నివాసాలకు దూరంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక సమస్యల వల్లే కుప్పకూలి ఉంటుందని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.