ప్రత్యేక వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసిన తర్వాతే బీజేపీలోకి వస్తున్నారు: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యా
ఇటివల అధికారంలో కి వచ్చిన బీజేపీలోకి పలువురు ఇతర పార్టీల నేతలు చేరుతున్న విషయం తెలిసిందే... దీంతో అవినీతీ ఆరోపణలు ఎదుర్కోంటున్న నేతలను ఈడీ ,సీబీఐ పేరుతో బెదిరించి పార్టీలోకి చేర్చుంచుకుంటున్నారని పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో స్పందించిన ఓ కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకునే ముందు గుజరాత్ నుండి తీసుకువచ్చిన ప్రత్యేక వాషింగ్ పౌడర్తో వాషింగ్ మిషన్లో ఉతికి ఆరేసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటున్నామని కేంద్రమంత్రి రావుసాహెబ్ డాన్వే అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలోనే బీజేపికి ప్రత్యేకంగా వాషింగ్ మిషన్ ఉందని, వారిని ఎలాంటీ అవినీతీ మరకలు లేకుండా నిర్మా పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత తీసుకుంటున్నామని అన్నారు.
ఇటివల జరిగిన లోక్సభలో జరిగిన ఎన్నికల్లో రెండోసారి తిరుగులేని మెజారితో అధికారంలోకి వచ్చిన బీజేపీ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నడుంబిగించింది. గతంలో బీజేపీ సిద్దాంతాలతో పని చేసిన వారికే పార్టీలో అన్నిపదవులు వరించేవి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దగా ప్రాధన్యాత ఇచ్చే వారు కాదు. సాధరణంగా ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి తీసుకునే సంస్కృతి బీజేపీలో గత ఎన్నికల వరకు లేకుండా ఉండేది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి ఇతరపార్టీల నేతలు పార్టీలోకి వచ్చేందుకు ఎలాంటీ నిబంధనలు లేకుండా తలుపుతు బార్ల తెరిచింది. దీంతో కార్పోరేటర్ల నుండి మాజీలందరు బీజేపీకి క్యూ కడుతున్నారు. ఇలా క్యూ కడుతున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే మహారాష్ట్రలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పలువురు ఎన్సీపీ నేతలు బీజేపీలో చేరారు. అయితే, ఈడీ,సీబిఐల పేరు చెప్పి బెదిరించి అవినీతి ఆరోపణలు ఉన్నవారిని బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ఎన్సీపీ ఆరోపణలు చేసింది. దీంతో మహారాష్ట్రలో పర్యటించిన కేంద్రమంత్రి రావుసాహెబ్ డాన్వే పై వ్యాఖ్యలు చేశారు.