హైజాక్ సుఖాంతం: నౌకతోపాటు 22మంది భారత నావికులను వదిలేసిన పైరేట్స్
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని సముద్రంలో గత వారం హైజాక్కు గురైన ఆయిల్ ట్యాంకర్తో భారత నౌకను హైజాకర్లు విడుదల చేశారు. ఈ నౌకలో ఉన్న 22మంది భారతీయ సిబ్బంది(నావికులు) క్షేమంగా ఉన్నారు.
22మంది నావికులతో భారత నౌక అదృశ్యం: హైజాక్ చేశారా?
We are delighted to report that the MT Marine Express, which was hijacked by pirates on Feb 1, is now back under the command of the captain & crew since ~04:00 SG time today. All crew members are reported to be safe & well & the cargo intact. We thank you all for your well wishes
— Anglo-Eastern (@angloeasterngrp) February 6, 2018
భారతీయ సిబ్బందిని విధుల్లో నియమించిన హాంగ్కాంగ్కు చెందిన ఓ కంపెనీ పైరేట్స్ ఆ నౌకను విడుదల చేశారని వెల్లడించింది. పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన తర్వాతే నావికులను, ఆయిల్ ట్యాంకర్ను విడుదల చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ.52కోట్ల విలువైన గ్యాసోలిన్ ను రవాణా చేస్తుండగా ఈ హైజాక్ జరిగింది.