నేటి అర్ధరాత్రి నుంచి పాత రూ. 500 నోటు చెల్లదు
గురువారం(డిసెంబర్ 15) అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోటు చెల్లుబాటుకు చివరి అవకాశాలు మూసుకుపోతున్నాయి.
న్యూఢిల్లీల్లీ: గురువారం(డిసెంబర్ 15) అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోటు చెల్లుబాటుకు చివరి అవకాశాలు మూసుకుపోతున్నాయి. విద్యుత్తు, నీటి బిల్లులు, ఔషధాల కొనుగోలు లాంటి కొన్ని పరిమిత లావాదేవీలకు ప్రస్తుతం వీటిని అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మినహాయింపులను పొడిగించకూడదని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అయితే ఈ నోట్లను బ్యాంకుల్లో మాత్రం జమ చేసుకుంటారని స్పష్టంచేశారు.
నోట్ల రద్దు: రూ.500 నోట్లకు ఆఖరి అవకాశం! ఆ తర్వాత..
రైల్వే, విమాన టిక్కెట్ల బుకింగ్, టోల్ప్లాజాల్లో పన్నుచెల్లింపులకు పాత రూ.500 నోట్లను ఇప్పటికే అనుమతించడంలేదు. పెట్రోలు బంకుల్లోనూ తీసుకోవడం లేదు. ఇప్పటికే నగదు కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. ఈ వెసులుబాటు ఎత్తేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.