Omicron:రిస్క్ దేశాల ప్రయాణికులకు టెస్టుల దడ, ఆర్టీ పీసీఆర్కు రూ.4500 వసూల్
ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో ఇరత దేశాల నుంచి ప్రయాణికులకు ఎయిర్ పోర్టులలోనే చేస్తున్నారు. అక్కడ నెగటివ్ వచ్చిన తర్వాత బయటకు పంపిస్తున్నారు. మళ్లీ తిరిగి ఇంట్లో వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు. ఇక పాజిటివ్ వస్తే నిశీతంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే వైరస్ రిస్క్ ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్ష చేస్తున్నారు. అయితే ఆర్టీసీ పరీక్ష తప్పనిసరి కావడంతో.. రేటు కూడా పెంచేస్తున్నారు. ఎంత అంటే రూ.4500 తీసుకుంటున్నారు. ఇదీ క్యాజుబల్ ఫీజు కంటే 9 రెట్లు ఎక్కువ. ప్రయాణికుల అవసరాన్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు.
క్యూ లైన్లు..
అయినప్పటికీ క్యూ లైన్లలో జనం ఉన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత వెయిట్ చేస్తున్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులో జరుగుతున్న తీరును వివరిస్తున్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన ఓ మహిళ తన అభిప్రయాన్ని పంచుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద పొడవాటి లైన్ ఉందని.. రిజల్ట్ కోసం వేచి చూడాల్సి వస్తోందని వివరించారు. అయితే సాధారణంగా జరిగే ఫలితం అలా ఉంటుందని.. త్వరగా రిజల్ట్ కోసం రూ.3900 చెల్లించానని తెలిపింది. రెండు గంటల్లో ఎయిర్ పోర్టు నుంచి వెళ్లానని తెలిపారు. రిపోర్ట్ గంటలో వస్తే.. మరీ 6 గంటలు ఎందుకు వెయిట్ చేయిస్తున్నారని ఆమె అడిగారు.
కంపల్సరీ
రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చేవారు మాత్రం టెస్ట్ చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని.. రిజల్ట్ వచ్చిన తర్వాతే వెళ్లాలని సూచించింది. ఇదీ వెళ్లేవారికి లేదంటే.. కనెక్టింగ్ ప్లైట్ వారికి కూడా వర్తిస్తోంది. స్వాబ్ టెస్ట్ రూ.500 అయితే, ఆర్టీ పీసీఆర్ రూ.3 వేలు తీసుకుంటున్నారు. బెంగళూరులో ఇలా ఉంటే ఢిల్లీలో రూ.3900, ముంబైలో 4500 తీసుకుంటున్నారు. ఫలితం లేటుగా వచ్చే ఫలితం కోసం 6 గంటలు.. వేగంగా వచ్చే టెస్టు కోసం గంట, 1.15 గంటలు వెయిట్ చేయిస్తున్నారు. అయితే ఇందులో ధరలో చాలా డిఫరెంట్ ఉంది. ఎలాగూ చేయించుకుంటారని వసూల్ చేస్తున్నారని సగటు ప్యాసెంజర్స్ వాపోతున్నారు.
స్వాబ్ టెస్టే ఎక్కువ
ఇక టెస్టుల విషయానికి వస్తే.. నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టుకు 1013 మంది వచ్చారు. వారిలో 792 మంది ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. 221 మంది ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఎయిర్ పోర్టుల వద్ద సోషల్ డిస్టన్స్ మాత్రం లేదు. మాస్క్ ధరించి ఉన్నారు.. కానీ అంటూ మరో ప్రయాణికుడు విషయాలను షేర్ చేసుకున్నాడు.