పిల్లలతో మోడీ సెల్ఫీ: శుభాకాంక్షలు అంటూ ట్వీట్
న్యూఢిల్లీ: పది రోజుల పర్యటన నిమిత్తం బ్రిస్బేన్లో ఉన్న ప్రధాని మోడీ ఇక్కడి క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు. ఈరోజు నవంబర్ 14, పండిట్ నెహ్రూ పుట్టినరోజు. పిల్లలకు నా శుభాకాంక్షలు అంటూ పిల్లలతో ప్రధాని మోడీ సెల్ఫీ దిగి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా అక్కడి పుసక్తంలో అగ్రికల్చరల్ రోబోట్ పై ఓ సందేశం రాయమని ప్రధానిని అధికారులు అడిగారు. అందుకు "పరిశొధన అభివృద్ధికి తల్లి లాంటింది" అని హిందీలో మోదీ సందేశం రాశారు. దాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఆగ్రో రోబోట్ అనేది ఓ తేలికపాటి యంత్రం. వివాహం సహా పలు కార్యక్రమాల్లో ట్రాక్టర్ లా విధులన్నింటినీ నిర్వహిస్తుంది. దాని గురించి తెలుసుకునేందుకు ప్రధాని యూనివర్శిటీ అంతా కలియతిరిగి చూశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చేరుకున్నారు. పదిరోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ, నిన్నటిదాకా మయన్మార్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జీ-20 సదస్సులో పాల్లొనేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది.
మరికాసేపట్లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్తో భేటీ కానున్నారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో అధికారకంగా పర్యటిస్తున్నారు.