గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు: సుప్రీంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నోటా వినియోగం అంశంలో కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నోటాపై స్టే విధించాలని కాంగ్రెస్ కోరింది.
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నోటా వినియోగం అంశంలో కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నోటాపై స్టే విధించాలని కాంగ్రెస్ కోరింది.
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి నోటా
కానీ సుప్రీం కోర్టు స్టే విధించడానికి గురువారం నిరాకరించింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు నోటా గుర్తుతోనే జరుగుతాయని సుప్రీం కోర్టు చెప్పింది.
గుజరాత్లో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో నోటా ఐచ్ఛికాన్ని చేర్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ బుధవారం సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోరడంతో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దానిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడమే కాక నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని కూడా గుజరాత్ కాంగ్రెస్ తన పిటిషన్లో కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురయింది.