స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ సహా ఏ నగరంలో ఎంత అంటే?
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.50 తగ్గించింది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలలోను ఆ రాష్ట్రాలు మరో రూ.2.50 తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5 తగ్గింది.
రూ.5 మేర తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర తాజాగా మరోసారి పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు పెరిగింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.82.26 పైసలు, డీజిల్ ధర రూ.74.11 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరగగా రూ.87.73కు చేరుకుంది. డీజిల్ ధర 31 పైసలు పెరగగా రూ.77,68కి చేరింది.
చెన్నైలో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగింది. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రూ.85.50, డీజిల్ రూ.78.35కు చేరుకుంది. కోల్కతాలో పెట్రోల్ ధర 32 పైసలు పెరగడంతో 84.09కు చేరగా, డీజిల్ ధర 29 పైసలు పెరగడంతో రూ.75.96కు చేరుకుంది. హైదరాబాదులో పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ.87.21కి చేరింది. డీజిల్ ధర రూ.31 పైసలు పెరిగి 80.61కి చేరంది.