వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదో ఒకరోజు మా చేతికి దొర‌క్క‌పోరు..: బీజేపీకి వార్నింగ్‌!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క‌ర్ణాటక‌లో 14 నెల‌ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం కుప్పకూలిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం భార‌తీయ జ‌న‌తాపార్టేన‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అందుకోవ‌డానికి బీజేపీ అడ్డ‌దారులు తొక్కింద‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ దేశ‌వ్యాప్తంగా 21 ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను ఆరంభించి క‌ర్ణాట‌క‌లో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల్చి వేసింద‌ని, ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల‌లపై దృష్టి సారించింద‌ని ఆరోపిస్తున్నారు బీజేపీ ప్ర‌త్య‌ర్థి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీలో చిచ్చు పెట్టి మ‌రీ.. చలి కాచుకుంటోంద‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. తాజాగా- కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా బీజేపీపై నిప్పులు చెరిగారు.

 One Day BJP Will Discover...: Priyanka Gandhis Warning On Karnataka

అలాంటి రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుందంటూ..
తాను చేసిన తప్పుల‌కు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఏదో ఒక రోజు ప‌శ్చాత్తాప ప‌డి తీరుతుంద‌ని ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. అలాంటి రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని అన్నారు. త‌మ చేతికి దొర‌క్క‌పోరు అని వ్యాఖ్యానించారు. డ‌బ్బులు పెట్టి అన్నింటినీ కొన‌లేమ‌ని, అంద‌ర్నీ ఒత్తిడికి గురి చేయ‌లేమ‌నే నిజాన్ని బీజేపీ నాయ‌కులు తెలుసుకునే రోజు ఎంతో దూరం లేద‌ని చెప్పారు. బీజేపీ అస‌లు రంగు ఏమిటో ఆ రోజు దేశ ప్ర‌జ‌లు తెలుసుకుంటార‌ని అన్నారు.

ద‌క్షిణాదిన కాంగ్రెస్ ప‌రిస్థితేంటీ? ఇప్ప‌ట్లో తేరుకోగ‌ల‌దా?ద‌క్షిణాదిన కాంగ్రెస్ ప‌రిస్థితేంటీ? ఇప్ప‌ట్లో తేరుకోగ‌ల‌దా?

బీజేపీ చేస్తోన్న అంతులేని అవినీతి కార్య‌కలాపాలను ప్ర‌జ‌లు ఎంతో కాలం పాటు స‌హించలేర‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జా హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డానికి రాజ్యాంగబ‌ద్ధంగా ఏర్పాటైన వ్య‌వ‌స్థ‌ల దుర్వినియోగాన్ని ప్ర‌జ‌లు గుర్తిస్తార‌ని అన్నారు. ఎంద‌రో మ‌హాత్ముల బలిదానాల మీద నిర్మితమైన ప్ర‌జాస్వామ్య సౌధాన్ని బీజేపీ అధికారం కోసం బ‌ల‌హీన ప‌రిచిందని విమ‌ర్శించారు.

English summary
Priyanka Gandhi Vadra hits out at the BJP after Karnataka floor test 14-month-old Congress-Janata Dal Secular coalition collapsed on Tuesday "One day BJP will discover everything cannot be bought, Congress leader Priyanka Gandhi Vadra hit out at the ruling BJP on Tuesday after the 14-month-old Congress-Janata Dal Secular government in Karnataka collapsed and tweeted that the party would discover one day that "everything cannot be bought".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X