ఏదో ఒకరోజు మా చేతికి దొరక్కపోరు..: బీజేపీకి వార్నింగ్!
న్యూఢిల్లీ: కర్ణాటకలో 14 నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం భారతీయ జనతాపార్టేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అందుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.
One day the BJP will discover that everything cannot be bought, everyone cannot be bullied and every lie is eventually exposed.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019
1/2
ఆపరేషన్ కమలను ఆరంభించి కర్ణాటకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి వేసిందని, ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్లలపై దృష్టి సారించిందని ఆరోపిస్తున్నారు బీజేపీ ప్రత్యర్థి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీలో చిచ్చు పెట్టి మరీ.. చలి కాచుకుంటోందని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా- కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా బీజేపీపై నిప్పులు చెరిగారు.
అలాంటి
రోజు
తప్పకుండా
వస్తుందంటూ..
తాను
చేసిన
తప్పులకు
భారతీయ
జనతాపార్టీ
ఏదో
ఒక
రోజు
పశ్చాత్తాప
పడి
తీరుతుందని
ప్రియాంకా
గాంధీ
వాద్రా
అన్నారు.
అలాంటి
రోజు
తప్పకుండా
వస్తుందని
అన్నారు.
తమ
చేతికి
దొరక్కపోరు
అని
వ్యాఖ్యానించారు.
డబ్బులు
పెట్టి
అన్నింటినీ
కొనలేమని,
అందర్నీ
ఒత్తిడికి
గురి
చేయలేమనే
నిజాన్ని
బీజేపీ
నాయకులు
తెలుసుకునే
రోజు
ఎంతో
దూరం
లేదని
చెప్పారు.
బీజేపీ
అసలు
రంగు
ఏమిటో
ఆ
రోజు
దేశ
ప్రజలు
తెలుసుకుంటారని
అన్నారు.
Until then I suppose, the citizens of our country will have to endure their unbridled corruption, the systematic dismantling of insitutions that protect the people’s interests and the weakening of a democracy that took decades of toil and sacrifice to build.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019
2/2
దక్షిణాదిన కాంగ్రెస్ పరిస్థితేంటీ? ఇప్పట్లో తేరుకోగలదా?
బీజేపీ చేస్తోన్న అంతులేని అవినీతి కార్యకలాపాలను ప్రజలు ఎంతో కాలం పాటు సహించలేరని చెప్పారు. ప్రజలను, ప్రజా హక్కులను పరిరక్షించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థల దుర్వినియోగాన్ని ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ఎందరో మహాత్ముల బలిదానాల మీద నిర్మితమైన ప్రజాస్వామ్య సౌధాన్ని బీజేపీ అధికారం కోసం బలహీన పరిచిందని విమర్శించారు.