వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

సుందర కశ్మీరం మరోసారి ఉలిక్కిపడింది. బారాముల్లా జిల్లాలో పేలుడు జరిగింది. అక్కడ కొత్తగా వైన్ షాపు ఓపెన్ అయ్యింది. దివాన్ బాగ్ వద్ద మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మిలిటెంట్ గ్రనేడ్ విసిరాడు. దీంతో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి రంజిత్ సింగ్ అని.. అతనిది రాజౌరి అని పోలీసులు చెబుతున్నారు. అతను గారిసన్ టౌన్‌లో కొత్తగా తెరచిని వైన్ షాపులో పనిచేస్తున్నాడు.

one killed, 3 injured in grenade blast at J&Ks Baramulla

ఘటనలో నలుగురు గాయపడగా.. ఒకరు తీవ్రగాయాలతో చనిపోయారు. అందరినీ సమీపంలో గల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రంజిత్ సింగ్.. బక్రా రాజౌరికి చెందిన వారు.. తీవ్రగాయాలతో చనిపోయారు. గాయపడ్డ వారు గోవర్దన్ సింగ్, రవి కుమార్, మరొకరు గోవింద్ సింగ్.. ఇతనికి కథువా కాగా.. ఆ ఇద్దరిదీ బిల్లావర్. ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ఏరియాలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనకు సంబంధించి రెసిటెంన్స్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్నామని తెలిపింది. కశ్మీర్ పండిట్ ఉద్యోగిపై దాడి తర్వాత కశ్మీర్ లోయలో ఇదీ రెండో పెద్ద ఘటన. దీంతో 4 వేల మంది పండిట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ కొలువు లోకేషన్ మార్చాలని కోరుతున్నారు.

English summary
One person was killed and three others were injured in a grenade blast at a newly-opened wine shop in Jammu and Kashmir's Baramulla district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X