బారాముల్లాలో గ్రనేడ్తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
సుందర కశ్మీరం మరోసారి ఉలిక్కిపడింది. బారాముల్లా జిల్లాలో పేలుడు జరిగింది. అక్కడ కొత్తగా వైన్ షాపు ఓపెన్ అయ్యింది. దివాన్ బాగ్ వద్ద మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మిలిటెంట్ గ్రనేడ్ విసిరాడు. దీంతో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి రంజిత్ సింగ్ అని.. అతనిది రాజౌరి అని పోలీసులు చెబుతున్నారు. అతను గారిసన్ టౌన్లో కొత్తగా తెరచిని వైన్ షాపులో పనిచేస్తున్నాడు.
ఘటనలో నలుగురు గాయపడగా.. ఒకరు తీవ్రగాయాలతో చనిపోయారు. అందరినీ సమీపంలో గల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రంజిత్ సింగ్.. బక్రా రాజౌరికి చెందిన వారు.. తీవ్రగాయాలతో చనిపోయారు. గాయపడ్డ వారు గోవర్దన్ సింగ్, రవి కుమార్, మరొకరు గోవింద్ సింగ్.. ఇతనికి కథువా కాగా.. ఆ ఇద్దరిదీ బిల్లావర్. ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ఏరియాలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనకు సంబంధించి రెసిటెంన్స్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్నామని తెలిపింది. కశ్మీర్ పండిట్ ఉద్యోగిపై దాడి తర్వాత కశ్మీర్ లోయలో ఇదీ రెండో పెద్ద ఘటన. దీంతో 4 వేల మంది పండిట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ కొలువు లోకేషన్ మార్చాలని కోరుతున్నారు.