పశ్చిమ బెంగాల్లో తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ..ఒకరు మృతి
పశ్చిమ బెంగాల్ : మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. మాల్డా నియోజకవర్గానికి జరిగుతున్న ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ముందుగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా మోతీగంజ్లోని టీఎంసీ కార్యాలయాన్ని ధ్వసం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. గొడవలకు పాల్పడి తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్ చేయాలని భావిస్తోందని బీజేపీ ఆరోపించింది. జరిగిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
ఇదిలా ఉంటే ముర్షిదాబాద్లో కాంగ్రెస్ టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ఓ గ్రామస్తుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని బాలిగ్రామ్ వాస్తవ్యుడు తియారుల్ కలామ్గా గుర్తించారు. గొడవల కారణంగానే తియారుల్ మృతి చెందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.